Mahatma gandhi wikipedia in telugu


గాంధీ జయంతి

గాంధీ జయంతి

విజయవాడ లోని ఘంటసాల సంగీత కళాశాల లో గాంధీ విగ్రహం

జరుపుకొనేవారుభారతదేశం
ప్రాముఖ్యతభారత స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ సేవలకు గుర్తింపు.
జరుపుకొనే రోజు2 అక్టోబరు
వేడుకలుసామాజిక, చారిత్రిక దినోత్సవం
సంబంధిత పండుగఅంతర్జాతీయ అహింసా దినోత్సవం
గణతంత్ర దినోత్సవం

అక్టోబరు 2నభారతదేశంలోగాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీజన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే)

2007జూన్ 15 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.[1]

వేడుకలు

[మార్చు]

భారత దేశంలో నాయకులు, విద్యార్థులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన రాజ్ ఘాట్ (కొత్త ఢిల్లీ) లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.[2] గాంధీ జ్ఞాపకార్ధం అతను అమితంగా ఇష్ట పడిన రఘుపతి రాఘవ రాజారామ్ గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.

150వ జయంతి

[మార్చు]

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 2018 అక్టోబరు 2న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సత్యపథం కార్యక్రమం నిర్వహించారు.

  • మహాత్మా గాంధీజీ జీవితం - సందేశంపై సాంస్కృతిక నీరాజనం కార్యక్రమ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రకాశనం చేస్తున్న బి. శేషుకుమారి, మామిడి హరికృష్ణ, సుధారాణి తదితరులు

  • మహాత్మా గాంధీజీ జీవితాన్ని గురించిన పాటలను పాడుతున్న విద్యార్ధులు.

  • జ్యోతి ప్రకాశనం చేస్తున్న మామిడి హరికృష్ణ, బి. శేషుకుమారి, సుధారాణి తదితరులు

  • మహాత్మా గాంధీజీ జీవితాన్ని గురించిన స్కిట్ ను ప్రదర్శిస్తున్న విద్యార్ధులు.

  • సత్యపథం (మహాత్మా గాంధీజీ జీవితం - సందేశంపై సాంస్కృతిక నీరాజనం) కార్యక్రమం వేదిక

  • సత్యపథం కార్యక్రమంలో మాట్లాడుతున్న మామిడి హరికృష్ణ

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]